ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనాతో మహిళ మృతి.. ఒంటిపై బంగారం మాయం

national |  Suryaa Desk  | Published : Sat, Sep 19, 2020, 08:51 AM

కరోనా వైరస్ ఓ వైపు దేశంలో కల్లోలం సృష్టిస్తుంటే.. కొంత మంది తమ నీచపు బుద్ధిని పోనిచ్చుకోవడం లేదు. కరోనా బారినపడి ఓ మహిళ మృత్యువాతపడటంతో ఆమె కుటుంబం తీరని దు:ఖంలో ఉండగా.. ఆ మృతదేహంపై నగలు మాయం చేశారు కొంత మంది కేటుగాళ్లు. ఉత్తర్ ప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. క‌రోనా సోకుతుందనే భయంతో రోగి ద‌రిదాపుల్లోకి వెళ్లడానికే జ‌నం జంకుతుండగా.. దొంగ‌లు మాత్రం ఏకంగా క‌రోనా మృతుల‌ ఒంటి పైనుంచే బంగారాన్నే కాజేయడం విస్మయపరుస్తోంది. మృతురాలి ఒంటిపైన ఉన్న బంగారు ఆభ‌ర‌ణాల గురించి ఆమె భ‌ర్త హాస్పిటల్ యాజ‌మాన్యాన్ని ప్రశ్నించ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో సెప్టెంబర్ 15న ఆమెను హాస్పిటల్‌లో చేర్పించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆ మరుసటి రోజు ఉదయమే ఆమె మరణించినట్లు హాస్పిటల్ సిబ్బంది చెప్పినట్లు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com