ఢిల్లీ క్యాపిటల్స్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిన్న34వ పుట్టిన రోజు జరుపుకొన్నాడు. అయితే, ఈ ప్రత్యేకమైన రోజున తన కుటుంబంతో లేకపోవడం ఎంతో బాధగా ఉందని అశ్విన్ ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్టు పెట్టాడు. ‘ఈ బయోబబుల్ జీవితం అత్యంత సన్నిహితుల్ని కూడా దూరం చేస్తోంది. ఈ విపత్కర సమయంలో నాకోసం కుటుంబం మొత్తం ఎంత త్యాగం చేసిందో ప్రతిరోజూ అర్థమవుతోంది. ఈ సందర్భంగా నా భార్య, పిల్లలు, తల్లి దండ్రులు అలాగే అభిమానులందరికీ ధన్యవాదాలు’ అని పేర్కొంటూ తన భార్య ప్రీతి నారాయన్తో కలిసి దిగిన ఓ ఫొటోను పంచుకున్నాడు. కాగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్ను పంజాబ్తో ఆడనుంది. గతేడాది అదే జట్టుకు కెప్టెన్గా ఉన్న అశ్విన్ ఈసారి ఢిల్లీ తరఫున బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.