చెన్నై సూపర్ కింగ్స్ కు మరో షాక్ తగిలింది. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నానని సురేష్ రైనా ప్రకటించాడు. దీనిని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ధృవీకరించింది. శుక్రవారమే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుల్లో 10 మందికి కరోనా సోకినట్టు తేలిన విషయం తెలిసిందే. ఇంతలోనే సురేష్ రైనా ఐపీఎల్ నుంచి తప్పుకుంటునట్టు ప్రకటించడంతో సీఎస్కేకు షాక్ తగిలినట్టైంది. ఈ సమయంలో సురేష్ రైనాకు తాము అండగా ఉంటామని సీఎస్కే యాజమాన్యం తెలిపింది. ఇటీవలే రైనా మహేంద్రసింగ్ ధోనీతో పాటుగా ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.