ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. అతిథ్యం దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. బెలిమ్ అనే ఓడ ద్వారా రిలేను ఫ్రాన్స్కు తీసుకొచ్చారు. బుధవారం జ్యోతిని అథ్లెట్లు మార్సెలో ప్రదర్శనగా తీసుకెళ్లనున్నారు.