ఇప్పటికే రాష్ట్రంలో కురిసిన వర్షాల కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఇక తాజాగా మరోరెండు రోజులపాటు ఏపీ లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఉత్తర చత్తీస్గఢ్, దాని పక్కనే ఉన్న తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి తోడు అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తర చత్తీస్గఢ్, దాని పక్కనే ఉన్న తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి తోడు అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దాని ప్రభావంతో రాష్ట్రంలో శని,ఆదివారాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.