ఓటమి భయంతో అవినాష్రెడ్డి ఊరు దాటేందుకు సిద్ధమయ్యారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. ఇందు కోసం పాస్పోర్టులు కూడా సిద్ధం చేసుకున్నారని ఆరోపించారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 'ఓడితే అరెస్టు తప్పదనే భయంతో అవినాష్రెడ్డి ఉన్నారు. ఎంపీగా ఆయన గెలిస్తే నేరం గెలిచినట్లే. వాళ్లే సింగిల్ ప్లేయర్గా ఉండాలనేది వైఎస్ భారతి వ్యూహం. గొడ్డలితో మిగతా వాళ్లనూ నరికేయండి.. అప్పుడు మీరే సింగిల్ ప్లేయర్' అని ఫైర్ అయ్యారు