ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొల్హాపూర్ లో క్రికెటర్ల ఫ్యాన్స్ మధ్య ఘర్షణలు... ఖండించిన సెహ్వాగ్

national |  Suryaa Desk  | Published : Sun, Aug 23, 2020, 07:39 PM

మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా కురుంద్వాడ్ పట్టణంలో ధోనీ, రోహిత్ శర్మ అభిమానులు పరస్పరం దాడులు చేసుకున్న ఘటన తెరపైకి వచ్చింది. వారిలో ఒకరిని ప్రత్యర్థులు చెరుకు పొలంలోకి తీసుకెళ్లి అతడిపై దాడి చేశారు. దీనిపై టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ తీవ్రంగా స్పందించాడు."పిచ్చోళ్లలారా... ఏంచేస్తున్నారు మీరు? క్రికెటర్లు బాగానే ఉంటారు, మధ్యలో మీరెందుకు కొట్టుకుంటారు? క్రికెటర్లు ఒకరిని మరొకరు అభిమానిస్తుంటారు. లేకపోతే ఎవరి పని వాళ్లు చూసుకుంటారు. కానీ కొందరు ఫ్యాన్స్ మాత్రం పిచ్చి ముదిరినట్టు కొట్టుకుంటున్నారు. ఇలాంటి కొట్లాటలు వద్దు. టీమిండియా ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటుంది" అంటూ సెహ్వాగ్ ట్విట్టర్ లో హితవు పలికారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com