వెలగపూడి, సూర్య ప్రధాన ప్రతినిధి : నవ్యాంధ్ర రాజధాని అమరావతిని కేవలం పరిపాలనా నగరంగానే కాకుండా 24 గంటలూ చైతన్యంతో తొణికిసలాడే ప్రజారాజధానిలా నిర్మించాలన్నది సీఎం చంద్రబాబు ఆకాంక్ష. ఆమేరకు ప్రజారాజధానిలో స్మార్ట్ సిటీని పీపుల్స్ ప్రెసింక్ట్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. గవర్నమెంట్ కాంప్లెక్స్కు ఆనుకుని, 650 ఎకరాలను దాని కోసం కేటాయించింది. ఇందులో రూ.1874 కోట్ల వ్యయంతో వివిధ అంశాలకు సంబంధించిన స్మార్ట థీమ్స్ను అమలు చేయాలని నిర్ణయించారు. ప్రాజె్ట నిర్మాణ వ్యయంలో రూ.1,000 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రాంట్ రూపంలో ఇవ్వనుండగా మిగిలిన రూ.874 కోట్లను వివిధ కేంద్ర పథకాలతోపాటు రాజధాని నిధుల సమీకరణకు ఉద్దేశించిన వివిధ వనరుల ద్వారా పొందాలని ప్రతిపాదించారు. స్మార్ట సిటీవాసులకు అధునాతన వీధిదీపాలు, సీసీటీవీలు, స్మార్ట డ్రింకింగ్ వాటర్, బయో టాయ్లెట్లు, డిజిటల్ హోర్డింగ్ బోర్డులు ఇత్యాదివి సమకూరుస్తారు. స్మార్ట సిటీలోని వివిధ వసతులు, వివిధ కార్యక్రమాల గురించి విస్తృత సమాచారాన్ని అందించే ప్రత్యేక యాప్ను రూపొందిస్తారు. ప్రజల భద్రత కోసం ఇంటెలిజెంట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను కూడా ప్రతిపాదించారు.
మైక్రో కై ్లమేట్ మేనేజ్మెంట్...
పరిసర ప్రదేశాలతో పోలిస్తే అమరావతిలో ఉష్ణోగ్రత కొన్ని డిగ్రీలు తక్కువ ఉండేలా చర్యలు చేపడుతున్నారు. దీనికి తగ్గట్టుగా ఎక్కడికక్కడ నీటితుంపర వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. మొక్కల పెంపకాన్ని చేపడతారు.
అత్యుత్తమ రవాణా వ్యవస్థ...
అత్యాధునిక ప్రజారవాణా, మోటారురహిత రవాణాను ప్రతిపాదించారు. కాలుష్యాన్ని నివారించేందుకు 120 సైకిళ్లతో పబ్లిక్ బైక్ షేరింగ్ సిస్టం, 50 ఎలక్ట్రికల్ బస్సులు, నడకదారులు, స్మార్ట్ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, స్మార్ట్ స్ట్రీట్ తదితరాలను ఏర్పాటు చేయనున్నారు.
బ్లూ- గ్రీన్ రాజధాని...
బ్లూ- గ్రీన్ కాన్సెప్ట్ తో అమరావతిని అభివృద్ధి చేయనున్నారు. 250 ఎకరాల్లో భారీ ఉద్యానవనం, పెద్ద పెద్ద సరస్సులు, 5 కిలోమీటర్ల పొడవైన కాల్వలు, 1 కి.మీ. పొడవైన రివర్ఫ్రంట్ను అభివృద్ధి పరుస్తారు.
యాక్టివిటీ సెంటర్స్...
రాజధానివాసులతోపాటు అమరావతికి వచ్చే పర్యాటకులకు మనోల్లాసాన్ని కలిగించే పలు సౌకర్యాలను ఇందులో ఏర్పాటు చేస్తారు. కళలకు కాణాచిగా నిలిచే క్రాఫ్ట్స బజార్, రెండు సిటీ స్కే్వర్లు, లెక్కకు మిక్కిలి దుకాణాలు, షాపింగ్ ప్లేసెస్తోపాటు వినోద కేంద్రాలనూ నెలకొల్పుతారు.