ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అలర్ట్! ఏపీలో పిడుగుల హెచ్చరికలు జారీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 30, 2020, 02:46 PM

ఏపీలో వాతావరణం చల్లగా మారింది. చాలా ప్రాంతాల్లో మబ్బులు కమ్మి ఉన్నాయి. చాలాచోట్ల తుంపర్ల జల్లులు కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే కొన్ని ప్రదేశాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కృష్ణా , గుంటూరు, ప్రకాశం జిల్లాలకు పిడుగు హెచ్చరిక ఉంది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులకు బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. కృష్ణా జిల్లాలోని గూడూరు, మొవ్వ, ఘంటశాల, మచిలీపట్నం, అవనిగడ్డ,కోడూరు, నాగాయలంక, చల్లపల్లి, పామర్రు, తోట్లవల్లూరు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే గుంటూరు జిల్లా గుంటూరు, తెనాలి, కొల్లూరు, రేపల్లె, బాపట్ల, కొల్లిపర, తుళ్ళూరు, ఇపూర్, నర్సారావుపేట, చిలకలూరిపేట ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉంది. ప్రకాశం జిల్లా ఇంకొల్లు, మార్టూర్, యద్దనపూడి, జనకవరం పంగులూరు. అద్దంకి, ముండ్లమూరు, పర్చూర్ , చినగంజాం, సింగరాయకొండ, టంగుటూరు ,కొరిశపాడు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేశారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల కింద, నీటికుంటలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com