త్రిపుర రాష్ట్ర ఎస్ఎఫ్ఐ నాయకులపై దాడికి పాల్పడిన ఇటువంటి బిజెపి ఏబీవీపీ గుండాలను అరెస్ట్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నిరంజన్ డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ మాట్లాడుతూ తలసేమియా భాదితుల కోసం బ్లడ్ క్యాంపు నిర్వహిస్తున్న విద్యార్ధుల నాయకులపై త్రీవ దాడికి పాల్పడినటువంటి బిజెపి నాయకులను అరెస్టు చేయాలని విద్యార్థుల సమస్యల పరిష్కారంలో పోరాడటం చేతగాక అనుక్షణం విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం కోసం పోరాటం చేస్తున్నటువంటి ఎస్ఎఫ్ఐ నాయకులపై దాడికి పాల్పడటం దుర్మార్గమైన చర్య భావిస్తున్నామన్నారు. అటువంటి గుండాల పై కఠిన చర్యలు తీసుకోకపోవడం అంటే సిగ్గుచేటు అని పేర్కొన్నారు. దాడిలోత్రిపుర రాష్ట్ర ఎస్.ఎఫ్.ఐ కార్యదర్శి సందీపన్ మరియు నాయకులుకు త్రీవ గాయపడిన వారికి కి నష్ట పరిహారం ఇప్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణ నాయకులు సాయి తదితరులు పాల్గొన్నారు.