కరోనా వైరస్ ప్రభావంతో దేశమంతా అల్లాడిపోతున్న సమయంలో పశ్చిమ బెంగాల్ లో ఉంపన్ తుఫాన్ విరుచుకుపడింది. దీంతో 72 మంది మరణించారు. ఉత్తర,దక్షిణ పరగణాల జిల్లాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కోల్ కత్తా మహానగరం గజగజ ఒణికిపోయింది. ఎక్కడికక్కడ ఇండ్లు,కరెంట్ స్తంభాలు,రోడ్లు ధ్వంసమయ్యాయి. అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. ఒడిశాలో కూడా ఉంపన్ తుఫాన్ తన ప్రభావాన్ని చూపింది. ఉంపన్ తుఫాన్ ప్రభావిత ప్రాంతంలో నేడు ప్రధాని మోడీ ఏరియల్ సర్వే చేయనున్నారు. ఉంపన్ దెబ్బకు బెంగాల్ అతలాకుతలమైంది.