భారత్ లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. కరోనా కేసుల సంఖ్య పెరగడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. భారత్ లో గత 24 గంటల్లో 6088 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. ఇప్పటి వరకు భారత్ లో మొత్తం 1,18,447 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ప్రస్తుతం 66,331 యాక్టివ్ కేసులున్నాయి. 48,533 మంది కోలుకోని డిశ్చార్జయ్యారు. 3583 మంది కరోనాతో మరణించారు. ఒక్క రోజులోనే 6088 మందికి కరోనా సోకడం ప్రస్తుతం ఆందోళనను కలిగిస్తుంది.