ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా పై హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 26, 2020, 03:27 PM

ప్రధాని నరేంద్ర మోదీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశానికి మూడు వారాల డెడ్ లైన్ ఉందని,దీనిని మనం జయిస్తే యుద్దాన్ని జయించినట్టేనన్నారు. వారణాసి ప్రజలు కరోనా నివారణలో స్పూర్తిగా నిలవాలని,ప్రజలంతా సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు. కరోనా పై అనుమానాలు ఉంటే 9013151515 వాట్సాప్ నంబర్ కు నమస్తే అని మెసేజ్ చేస్తే రెగ్యులర్ అప్ డేట్స్ వస్తాయని తెలిపారు. ఈ నంబర్ కు కాల్ చేసి తమకున్న అనుమానాలను కూడా నివృత్తి చేసుకోవచ్చన్నారు. కరోనా వైరస్ పై ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు,సలహాలు,సూచనలు కూడా అధికారులు ఇస్తారని మోదీ తెలిపారు. ప్రజలంతా లాక్ డౌన్ పాటించి సహకరించాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com