విజయవాడ, సూర్య బ్యూరో : 2017 హజ్ య్త్రాకు సంబంధించి వెయిటింగ్ లిస్ట్ను హజ్ కమిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. దీంతో వెయిటింగ్ లిస్ట్ 288 వరకు వున్న వారికి హజ్ చేయడానికి అవకాశం లభించింది. డ్రాలో పేరు వచ్చినా, వివిధ కారణాల వల్ల దేశవ్యాప్తంగా 5 వేల 402 మంది హజ్ రుసుము చెల్లించకపోవడంతో వారి పేర్లు తొలగించి వెయిటింగ్ లిస్ట్లో వున్నవారికి అవ కాశం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 263 మంది హజ్ యాత్రికులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. దీంతోపాటు మరో 25 మందికి అదనపు కోటా కింద, మొత్తం 288 మందికి అవకాశం కల్పిస్తూ, ఎపికి సంబంధించిన వెయిటింగ్ లిస్ట్ను సెంట్రల్ హజ్ కమిటీ విడుదల చేసింది. అయితే దరఖాస్తు చేసిన వారు తాము ఏ కేటగిరి సెలెక్ట్ చేసుకున్నారో ఆ ప్రకారంగా డబ్బులు చెల్లించాల్సి వుంది. హైదరాబాద్ ఎంబారకేషన్ పాయింట్ నుండి గ్రీన్ కేటగిరి లో వెళ్ళేవారికి 2,35,150, అజీజియా కేటగిరిలో వెళ్తున్నవారికి 2,01,800 రూపాయలను, బెంగుళూరు ఎంబారకేషన్ పాయింట్ నుండి గ్రీన్ కేటగిరిలో వెళ్ళేవారు 2,39,600, అజీజియా కేటగిరిలో వెళ్తున్నవారు 2,06,200 రూపా యలను జూన్ 19వ తేదీ లోపు చెల్లించాలని, ఎపి స్టేట్ హజ్ కమిటీ ఎగ్జిక్యూ టివ్ ఆఫీసర్ ఎం.డి. లియాకత్ అలీ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇస్లామిక్ డవలప్ మెంట్ బ్యాంక్ ద్వారా ఖుర్బానీ ఇవ్వాలనుకునే వారు అద నంగా 8 వేల రూపాయలు చెల్లించాల్సి వుంటుంది. రిపీటర్ హైదరాబాద్ ఎంబా రకేషన్ నుండి వెళ్లితే అదనంగా విమాన ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే బెంగుళూరు నుంచి వెళ్లితే అదనంగా విమాన ఛార్జీలు 1500 రూపా యలు చెల్లించాలి. షియా హజ్ యాత్రికుల మిఖాత్ జోఫా సెలెక్ట్ చేసుకున్నటై్లతే 1,739 రూపాయలు అదనంగా చెల్లించాలి.
అన్ని చెల్లింపులు స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా, అకౌంట్ నెంబర్ 32175020010, లేదా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబర్ 318702010406009 ద్వారా సెం్టల్ హజ్ కమిటీ అకౌంట్ కు జూన్ 19వ తేదీ లోపు చెల్లించాలి. ఒరిజనల్ పాస్ పోర్ట్, వైట్ బ్యాక్ గ్రౌండ్గ లో పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫొటో, బ్యాంక్లో జమాచేసిన మొత్తానికి సంబంధించిన ఒరిజినల్ చలానా, మెడికల్ స్క్రీనింగ్ ఫిట్ నెస్ సర్టిఫికెట్, జూన్ 19 లోపు విజయవాడలోని ఎపి స్టేట్ హజ్ కమిటీకి అందజేయాలని ఎపి స్టేట్ హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎం.డి.లియాకత్ అలీ తెలిపారు.