తిరుమల, సూర్య ప్రత్యేక ప్రతినిధి : ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమలలో మీడియా కేంద్రాన్ని వెంటనే తొలగించాలని ఎమ్మెల్సీ గాలి ముద్దు క్రిష్ణమ నాయుడు అధికారులను కోరారు. తిరుమలలో మంగళవారం శ్రీవారిని దర్శించు కున్న అనంతరం ఆలయం ముందర విలేకరులు మాట్లాడ మనగా తిరస్కరించారు. అంతేకాకుండా ఆధ్యాత్మిక కేంద్రంలో తానేమీ మాట్లాడటానికి అవకాశం ఇవ్వకూడ దని తెలిపారు. ఆలయం ముందర ఉన్న మీడియా పాయింట్ను ఎత్తివేయాలని అధికారులను కోరుతున్నట్లు పేర్కొన్నారు. తిరుమలలో ఆధ్యా త్మికం తప్ప మరే రాజకీయ విషయాలు ఇకమీదట చర్చించ కూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.పవిత్ర శ్రీవారి ఆల యం ముందు ఏర్పాటు చేసిన మీడియా పాయింట్ను తొల గించి పవిత్ర ఆలయానికి వచ్చే భక్తులు రాజకీయాలకు సంబంధమైన విమర్శలు ప్రతి విమర్శలు సినిమా ఇంట ర్వ్యూలు వ్యక్తిగత వివరాలు తెలిపే స్టేట్మెంట్లు ఇస్తూ తిరుమల పవిత్రతకు భంగం కలుగకుండా చర్యలు వెం టనే తీసుకోవాలని కోరారు. తిరుమలకు వచ్చే ప్రతిఒక్కరు శ్రీవారిని దర్శించుకొని తిరుమల ప్రశాంత తకు భంగం కలిగించే అవకాశం ఇవ్వకూడదని కోరారు. ఎమ్మెల్సి ముదు ్దక్రిష్ణమ నాయుడు మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు నిరాకరించడమే కాకుండా తొలగించా లని, అవసరమైతే విజువల్స్ మాత్రమే తీసుకో వాలని కోరడం మంచి పరిణామం.
ఆయన వార్తకు భక్తుల మనోభావాలను గ్రహించి తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం అందరికీ ఆదర్శం. ఇటీవల ఎమ్మెల్యే రోజా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్పై పలు దఫాలు విమర్శనాస్త్రాలు సంధించారు. దానిపై శివసేన నాయకులు అభ్యంతరం తెలిపారు. తిరుమలలో పవ్త్రితకు భంగం కలి గించే విధం గా ఎటువంటి రాజకీయ ప్రసంగాలు ఇవ్వ కూడ దని ఎమ్మెల్యే రోజాకు ప్రెస్మీట్ ద్వారా సూచించారు.
ఏది ఏమైనా దేవుని దగ్గర రాజకీయాలు మాట్లాడకుండా చర్య లు తీసుకోవాల్సిన బాధ్యత టిటిడిపై ఉంది. విఐపి బ్రేక్ దర్శనం సమయంలో మీడియా పాయింట్ వద్ద టిటిడి ప్రజా సంబంధాల విభాగం అధికారులు కనపడక పోవడం వల్ల మీడియా పాయింట్ రాజకీయ వేదికగా మారుతోంది.