విద్యుత్ రంగంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఎనర్జీ ఎక్స్ పోర్ట్ పాలసీ తయారీకి సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో ప్లాంట్లు పెట్టాలనుకునేవారికి సానుకూల వాతావరణం కల్పించేలా పాలసీ ఉండాలని జగన్ ఆదేశించారు. ఏపీలో మరో వెయ్యి మెగావాట్ల విధ్యుత్ ఉత్పాదనకు ఎన్టిపీసి ముందుకు వస్తుందని అధికారులు తెలిపారు. వీలైనంత త్వరగా ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జగన్ తెలిపారు. లీజ్ ప్రాతిపదికన పరిశ్రమలకు భూములిచ్చే ప్రతిపాదనపై చర్చిస్తున్నారు. భూములిచ్చే రైతులకు ప్రతి ఏటా ఆదాయం వస్తుందని సీఎం జగన్ తెలిపారు.