వెల్లింగ్టన్: న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు ఇన్నింగ్స్ల్లో (2), (19) విఫలమవ్వడంపై టీమ్ఇండియా మాజీ బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్ స్పందించాడు. కోహ్లీ మరింత క్రమశిక్షణతో ఆడి, ఓపిక పట్టాల్సిందన్నాడు. మూడో రోజు ఆటముగిసే సరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అజింక్య రహానె(25), హనుమ విహారి(15) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం కివీస్ కన్నా భారత్ 39 పరుగుల వెనుకంజలో ఉంది. వీళ్లిద్దరి బ్యాటింగ్పైనే టీమ్ఇండియా ఫలితం ఆధారపడి ఉంది.