ట్రెండింగ్
Epaper    English    தமிழ்

9 నెలల కనిష్టానికి ముడిచమురు ధర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 26, 2017, 01:34 AM

లండన్‌: చమురు ఉత్పత్తులు 9 నెలల కనిష్టానికి చేరినట్టు ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ది పెట్రోలియం కంట్రీస్‌ (ఓపిఇసి) మంత్రులు ప్రకటించారు. ఫలితంగా చమురు ఉత్పత్తులను మరింత పెంచాల్సి ఉందని నిర్ణయించారు. గత మూడు సంవత్సరాలుగా పేరుకు పోయిన చమురు తెట్టును తొలగించి, చమురు ఉత్పత్తులను పెంచాలని తీర్మానించారు. వియన్నాలో జరిగిన ఒపెక్‌ ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న 14 చమురు కంపెనీల ఉత్పత్తిదారులు 2018 మార్చి నాటికి నిర్ణీత క్ష్యం మేరకు చమురు ఉత్పత్తుల అభివృద్ధికి సమ్మతి తెలిపారు. ఒపెక్‌తో పాటు రష్యా, ఇతర ఉత్పత్తిదారులు 2018 తొలి త్రైమాసికం వరకూ రోజుకు 1.8 మిలియన్ల బ్యారళ్లను ఉత్పత్తి చేయాలని నిర్ణయించాయి. ఈ సందర్బంగా సౌదీ అరేబియా మంత్రి ఖలిద్‌ అల్‌ ఫలి మాట్లాడుతూ ఒపెక్‌ రాబోయే తొమ్మిది నెలలో అత్యధిక చమురు ఉత్పత్తులు సాధించాలని నిర్ణయం తీసుకుందని అయితే ఈ లక్ష్య సాధనకు కొన్న ఆటంకాలున్నాయన్నారు. ఇందుకు కోసం ముందుగా అత్యంత త్వరగా చమురు డ్రైయిన్‌ను తొలగించాల్సి ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా యుఎస్‌ ఆయిల్‌ ఉత్పత్తిదారులు ఇప్పటికే 2016 నుండే చమురు ఉత్పత్తులను 10శాతం మేర పెంచి చమురు ధరలు, పంపిణీల మధ్య ఉండే గ్యాప్‌ను పూరించే ప్రయత్నం ప్రారంభించారు. 


రూ.30కే పెట్రోల్‌ అందనుంది: అమెరికన్‌ ఫ్యూచరిస్ట్‌ టోనీ సెబా: వాహనదారులకు అమెరికన్‌ ఫ్యూచరిస్ట్‌ టోనీ సెబా తీపికబురు చెప్పారు. ఆయన సిలికాన్‌ వ్యాలీ వ్యవస్థాపకుడు, స్టాన్‌ఫర్డ్‌ కాంటినెనింగ్‌ స్టడీస్‌ ప్రోగ్రాంలో బోధకుడుగా ఉన్నారు. రాబోయే ఐదేళ్లలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 30ల కన్నా తక్కువ రేటుకే లభించనుందని ఆయన తెలిపారు. సోలార్‌ పవర్‌కు భారీగా డిమాండ్‌ పెరగడం, సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లతో చమురు డిమాండ్‌ గణనీయంగా పతనం కానుండడంతో చమురు ధరలు భారీగా తగ్గిపోతాయని సెబా అంచనా వేశారు. ప్రధానంగా చమురు బ్యారెల్‌ ధర త్వరలోనే 25 డాలర్లకు తగ్గనుందని తెలిపారు. ఇది ఇలాగే కొనసాగి 2020 నాటికి చమురు గిరాకీ 100 మిలియన్‌ బారల్స్‌కు తగ్గుతుందని తెలిపారు. అలాగే పది సంవత్సరాలలో 70 మిలియన్‌ బారెల్స్‌ పడిపోతుందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్‌ కార్ల వినియోగం భారీగా అధికమై, ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. అలాగే, ఈ వాహనాల ధరలు కూడా చవకగా ఉంటాయని అంచనా వేశారు. అంతేగాక, 2030 నాటికి 95 శాతం  ప్రజలు  ప్రైవేటు వాహనాలకు స్వస్తి చెబుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఆటో మొబైల్‌ రంగం కనిపించకుండా పోతుందని చెప్పారు. సెబా వేసిన ఈ అంచనాల నేపథ్యంలో ఇటీవల కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి పియుష్‌ గోయల్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 2030 నాటికి మనదేశంలో ఎలక్ట్రిక్‌ కార్లు రానున్నాయని ఆయన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అంతేగాక, రానున్న 15 సంవత్సరాల తర్వాత దేశంలో ఒక్క పెట్రోల్‌ లేదా డీజిల్‌ కారు అమ్మకాలు కూడా ఉండబోవని ఆయన పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com