ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతిలో నా జ్ఞాపకాలు లేకుండా చేయాలన్న కుట్రతోనే ..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 22, 2019, 10:51 PM

అమరావతిలో నా జ్ఞాపకాలు లేకుండా చేయాలన్న కుట్రతోనే నవ్యాంధ్ర రాజధాని నామరూపాల్లేకుండా చేస్తున్నారనీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రస్తుతం అమరావతితో పాటు.. రాష్ట్ర పరిస్థితిని చూస్తుంటే ఎంతో బాధ వేస్తోందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటన మంగళవారం కూడా సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమరావతి ప్రాజెక్టు కొనసాగించాలని వైసీపీ సర్కారుకు హితవు పలికారు. నాడు హైదరాబాద్ అభివృద్ధి చేయాలని తాము భావించినప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా సహకరించారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కూడా అడ్డుపడి ఉంటే హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చేదా? అని ప్రశ్నించారు.
ఇకపోతే, హైదరాబాద్ విషయంలో విజన్ తనదే అని, ఇప్పటికీ హైదరాబాద్ అభివృద్ధికి తన పేరే చెబుతారని తెలిపారు. ఇప్పుడు అమరావతి విషయంలోనూ తన గురించే చెప్పుకుంటారని భావించి ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి మూడు నెలలు అయినప్పటికీ ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ పేరుతో ఏం తేల్చారని చంద్రబాబు నిలదీశారు. అంతేకాకుండా, 'వీళ్లకునచ్చిన కాంట్రాక్టర్లకే డబ్బులు ఇస్తున్నారు. రూ.2000 కోట్లు ఇచ్చినట్టు తెలిసింది. ఎవరికి ఇచ్చారో, ఎంతిచ్చారో చెప్పాలి. వీళ్లకు నచ్చిన మేఘా సంస్థకో, గాయత్రీ సంస్థకో, ఓ మంత్రికో ఇచ్చుంటారు. టెండర్లలోనూ అంతే. అవి రివర్స్ టెండర్లు కాదు, రిజర్వుడ్ టెండర్లు. ఆ మాత్రానికే పెద్ద పారదర్శక ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్నారు. రూ.7500 కోట్లు నష్టం వస్తుంటే రూ.750 కోట్లు ఆదా చేశామంటున్నారు. పోలవరం అథారిటీ కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ప్రాజెక్టు లిటిగేషన్‌లో పడితే ఎప్పటికి పూర్తవుతుంది అని అథారిటీ ఆందోళన వ్యక్తం చేసిందని చంద్రబాబు గుర్తుచేశారు.
ఇకపోతే, రాజధాని విషయంలోనూ ఇలాగే వ్యవహరిస్తున్నారు. ఇవాళ్టికి సరిగ్గా నాలుగేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోడీని పిలిచి రాజధానికి శంకుస్థాపన చేయించాం. ప్రపంచమంతా నాడు అమరావతి పేరు మార్మోగింది. అమరావతి అనే కొత్త నగరం వస్తోందని ప్రపంచమంతా చర్చించుకున్నారు. అమరావతి కోసం అనుసరించిన లాండ్ పూలింగ్ ప్రక్రియను హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో కేస్ స్టడీగా పరిగణించారు. ఓ నగరం కోసం ఇన్నివేల ఎకరాలు ఇస్తారా అని చర్చించుకున్నారు. అమరావతి ఓ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్, ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు పెట్టనవసరంలేదు. అలాంటి బంగారు గుడ్లు పెట్టే బాతును చంపేస్తారా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)ద్వారా ఇప్పటి వరకూ 13 జిల్లాల్లో వికలాంగులకు సదరమ్ సర్టిఫికెట్ల జారీకి 12లక్షల 35వేల 493 ధరఖాస్తులు స్వీకరించి 10లక్షల 78వేల 70 ధరఖాస్తులను అనగా 87.26 శాతం అంకవైకల్య నిర్ధారణ చేయగా వాటిలో 8లక్షల 48వేల 422 మందికి సదరమ్ సర్టిఫికెట్లను జారీ చేయడం జరిగిందని స్త్రీశిశు మరియు దివ్యాంగుల సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కె.దమయంతి వివరించారు.
వాటిలో 5లక్షల సర్టిఫికెట్లకు సంబంధించిన డేటాను యుడిఐడి కార్డులు జారీ చేసే సంస్థకు బదిలీ చేయగా మరో 4లక్షల మందికి సంబంధించిన డేటాను బదిలీ చేయాల్సి ఉందని చెప్పారు.గత ఏడాది ఆగస్టు 3 నుండి అక్టోబరు 20 వరకూ డిజిటల్ సర్టిఫికెట్ల జారీకై మీసేవ కేంద్రాల ద్వారా ప్రత్యేక స్లాట్లను కేటాయించగా 80వేల 995 మంది ధరఖాస్తు చేయగా వారిలో 57వేల 662 మందికి సర్టిఫికెట్లను జారీ చేసినట్టు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com