టీవీ నటి రేఖా సింధు కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది, చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన దుర్ఘటనలో ఆమె మృతి చెందింది. ఆమె ప్రయాణిస్తున్న కారు తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని సున్నంపకొట్టయ్ గ్రామం సమీపంలో ప్రమాదానికి గురైంది, కారులోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.ప్రమాదంలో చనిపోయిన మిగతా ముగ్గురిని అభిషేక్ కుమారన్(22), జయకంద్రన్(23), రక్షణ్(20)గా గుర్తించారు. మృతదేహాలను తిరుపట్టూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రేఖా సింధు తమిళ, కన్నడ టీవీ షోల్లో నటించింది. షూటింగ్ కోసం చెన్నై వెళుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది.