తీర్పు చెప్పిన అనంతరం ఓ జడ్జి తుపాకీతో కాల్చుకున్న సంఘటన కలకలం సృష్టించింది. థాయ్ లాండ్ లోని యాలా కోర్టులో పనిచేస్తున్న కనాకోర్న్ పియావంచన అనే జడ్జి శుక్రవారం మధ్యాహ్నం ఓ హత్యకేసులో ఐదుగురు ముద్దాయిలను నిర్దోషులుగా ప్రకటిస్తూ వెంటనే తన దగ్గర ఉన్న తుపాకీని జేబులో నుంచి తీసుకుని ఛాతిలో పేల్చుకున్నారు. ఒకరిని శిక్షించాలంటే అందుకు తగ్గ ఆధారాలు ఖచ్చితంగా ఉండాలి లేకుంటే శిక్ష వేయకూడదు. ఈ ఐదుగురు నిందితులు నేరం చేశారని నా ఉద్దేశం కాదు. న్యాయ ప్రక్రియలో మరింత పారదర్శత ఉండాలని అంతకు ముందు కోర్టు ఆవరణలో జడ్జి ఫేస్ బుక్ లైవ్ లో ఉద్వేగ పూరితంగా ప్రసంగించారు. థాయ్ లాండ్ కోర్టులు ధనవంతులకే అనుకూలంగా ఉంటున్నాయని, పేదవారి పట్ల కఠినంగా ఉంటున్నాయని విమర్శలు వస్తున్నాయి. వీటిని సహించలేకే జడ్జి ఆత్మహత్యకు యత్నించారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తుపాకీతో కాల్చుకున్న జడ్జిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రస్తుతం కోలుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు.