రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జోధ్ పూర్ లోని ధాధానియా గ్రామ సమీపంలో బస్సు- మినీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే 13 మంది దుర్మరణం చెందగా 8మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జోథ్ పూర్ లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.