స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్ణయం తమ రాష్టంరలో కూడా అమలు చేయాలని ఇప్పుడు తమిళనాట కూడా డిమాండ్ ఆరంభమైంది. ఇందుకు అనుగుణంగా అన్ని ప్రైవేటు సంస్థల్లో కూడా స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండు చేస్తూ తమిళనాట ఉద్యమమేఆరంభించారు. ఈ క్రమంలో జగన్ ను ఆంధ్రా తలైవాగా అభివర్ణిస్తూ రహదారుల్లో భారీ ఎత్తున ఫ్లెక్సీలు నిలిపారు.
తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసి, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిణిస్తూ, జగన్ ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు కన్నడ నాట కూడా అమలు చేయాలన్న డిమాండ్ అందుకున్నాయి అక్కడి ఆర్టీసీ కార్మీక సంఘాలు తక్షణమే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కర్నాటకలోని హీరే కరూర్ ఆర్టీసీ డిపో సిబ్బంది ఆందోళన చేయటంతో పాటు వై.ఎస్. జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఇక ఇప్పటికే తెలం గాణలో కూడా ఆర్టీసి విలీనంకు సంబంధించి పోరాటాన్ని ఆర్టీసీ యూనియన్లు ఆరంభించాయి కూడా.