అత్యల్ప ఆదాయ వర్గాల వారికి బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి (కేబీసీ) వరంగా మారినట్టు కనిపిస్తోంది. గురువారం రాత్రి ప్రసారమైన కేబీసీలో ఓ ప్రైవేట్ స్కూలులో పిల్లలకు భోజనం చేసి వండి పెట్టే మహిళ ఏకంగా కోటి రూపాయలు గెలుచుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. కోటిరూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పిన ఆమె మహారాష్ట్రకు చెందిన బబిత థాడేది. రోజూ ఆమె 450 మంది చిన్నారులకు వంట చేసి పెట్టేది. దీనికి గాను ఆమెకు ముట్టే ప్రతిఫలం నెలకు రూ.1,500 మాత్రమే అందుకునే ఆమె హాట్ సీట్లో కూర్చుని బిగ్ బీ అడిగిన కఠిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి రూ.కోటిని సొంతం చేసుకుంది. ఐహించని అదృష్టం వరించిన ఆమె తన గురించి చెపతూ పాఠశాలకు వచ్చే వార్తా పత్రికనైనా చదివే తీరిక లేని పరిస్థితి తనదని, నిత్యం బతుకు పోరాటంలో సమయం సరిపోతోందని చెప్పింది. ఈ డబ్బులతో ఏం చేస్తారని అమితాబ్ ఆమెను అడిగినప్పుడు…ఇప్పటి వరకు కనీసం నా వద్ద మొబైల్ ఫోను కూడా లేదు. ముందుగా దానిని కొనుక్కొంటా..అని సమాధానమిచ్చింది.