విజయవాడ, మేజర్న్యూస్: ఎన్టీఆర్ ఆరోగ్య యూనివర్సిటీ గ్రేస్ మర్క్స స్కాంను కాంగ్రెస్ పార్టీ ఒక మినీ వ్యాపం స్కాంగా పరిగణిస్తోందని ఏపీ పీసీసీ డాక్టర్స సెల్ కో చైర్మన్ డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం నాడు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ స్కాంపై గత సంవత్సరంలో యమ్సిఐ కి కాంగ్రెస్ పార్టీ డాక్టర్స సెల్ ఫిర్యాదు చేసిన విషయం గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో యమ్ సి ఐ విచారణ జరిపి తప్పు జరిగిందని గుర్తించి భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చూసు కోవాలని హెచ్చరించిందని పేర్కొన్నారు.