ఏపీ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు
అమరావతి నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి : దేవాలయ గర్భాలయంలో పనిచేసే అర్చకులకు వయో పరిమితి 65 సంవత్సరాలు, పరిపాలన విభాగంలో పనిచేసే వారికి 60 సంవత్సరాలు పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి పైడి కొండల మాణిక్యాలరావు తెలిపారు. శుక్రవారం ఆయన వెలగపూడి సచివాలయంలోని తన ఛాంబర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేవాలయాల్లో సోలార్ పవర్ను ఉపయోగిస్తూ పవర్ సేవ్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి తెలిపారు. దేవాలయాల స్థల సమస్యలను పరిష్కరించేందుకు లోక్ అదాలత్లను ఏర్పాటు చేసి ఎన్ఓసీలను ఇప్పించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. దేవాలయాల్లోని పాఠశాలలు, వేద పాఠశాలల్లో ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసి నూతన కోర్సుల ద్వారా విద్యార్థులకు స్కిల్ డెవలప్ మెంట్ అవకాశాలను కల్పించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. దివ్యదర్శనంలో మార్పులు చేర్పులు చేపట్టి అతి త్వరలో పూర్తి స్థాయి కార్యక్రమాలను అమలు చేసేందుకు నిర్ణయించి నట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ర్టంలో ఉన్న ప్రముఖ దేవాలయాల ఫోటోలను ఓ పుస్తకంలో ముద్రించి ఆ పుస్త్తకాలను ఎయిర్ పోర్ట, స్టార్ హోటల్స, బస్టాండ్, టూరిజం, లైబ్రరీ, తదితర స్థలాల్లో ఏర్పాటు చేసేందుకు నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.