రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. అలాగే పారిశ్రామికాభివృద్ధి కోసం కూడా కృషి చేస్తామని ఆమె అన్నారు. సింగూర్ భూముల పట్టాలను రైతులకు ఇచ్చి నేటికి మూడేళ్లయిందని ఆమె అన్నారు. గత వామపక్ష ప్రభుత్వం సింగూర్లో రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కుని టాటా పరిశ్రమకు ఇచ్చిందని, తాము అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు తిరిగి వారి భూముల పట్టాలను ఇచ్చామని ఆమె గుర్తు చేశారు.