టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరగనున్న ఛలో ఆత్మకూరు కార్యక్రమం వాయిదా పడలేదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అన్నారు. బుధవారం యధాతథంగా కార్యక్రమం జరుగుతుందన్నారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ ఉన్నతాధికారులు వచ్చి తమకు హామీ ఇచ్చేవరకు శిబిరం కొనసాగుతుందని వర్ల స్పష్టం చేశారు.