శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు కుట్ర పన్నుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… కక్ష్యసాధింపు చర్యలకు వెళ్లకూడదని వైసీపీ నిర్ణయమని అన్నారు. యరపతినేని శ్రీనివాస్, కోడెల శివప్రసాదరవు, ప్రత్తిపాటి పుల్లారావులు పల్నాడులో గొడవలు సృష్టించారన్నారు. వైసీపీ కూడా రేపు చలో ఆత్మకూరు కార్యక్రమం చేస్తుందన్నారు. పెయిడ్ ఆర్టిస్టులతో రాజకీయ డ్రామాలాడుతున్నారన్నారు.