వచ్చేవన్నీ పండుగ రోజులే కావడంతో అమెజాన్ మరోమారు ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’కు రెడీ అవుతోంది. అయితే, ఈ సేల్ ఎప్పుడు నిర్వహించేదీ వెల్లడించలేదు. ఈ సేల్లో భాగంగా ప్రకటించనున్న ఆఫర్లకు సంబంధించి మాత్రం కొన్ని వివరాలు వెల్లడయ్యాయి.
ఈ సేల్ తొలుత అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు అందుబాటులోకి రానుంది. ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించనున్నట్టు సమాచారం. ఇక, స్టేట్బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డు వినియోగదారులకు అదనంగా 10 శాతం రాయితీ లభించనుంది. ఎంపిక చేసిన డెబిట్ కార్డులపై ఈఎంఐ సౌకర్యం అందుబాటులోకి తీసుకొస్తుండగా, బజాజ్ ఫిన్సెర్వ్ కార్డు యూజర్లకు నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్ చేయనుంది. అలాగే, అమెజాన్ పే, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లకు 5 శాతం రివార్డు పాయింట్లు కూడా లభిస్తాయి.