దక్షిణాది రాష్ట్రాలకు ఉగ్ర ముప్పు పొంచి ఉందని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. తీర ప్రాంతాల్లో గుర్తు తెలియని పడవులు కనిపిస్తే తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాల డీజీపీలను కేంద్ర హోంశాఖ ఆదేశించింది. సర్క్రిక్ ప్రాంతంలో గుర్తు తెలియని పడవలు కనిపించడంతో దక్షిణాది రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ముఖ్యంగా ఆర్మీకి సంబంధించి లెఫ్ట్నెంట్ జనరల్ ఎస్.కే. సైనీ ఈ ఇన్ఫార్మేషన్ను కేరళ పోలీస్ శాఖకు, ఇతర రాష్ట్రాల డీజీపీలకు అందజేశారు. ‘‘సర్క్రిక్ ప్రాంతంలో గుర్తు తెలియని బోటులు మాకు కనిపించాయి. వారు బోట్లు వదిలేసి వెళ్లిపోయారు. ఆ బోట్లో ఉన్నవాళ్లు ఎటు వెళ్లిపోయారో అన్నది గుర్తించాల్సి ఉంది.. ఆ బోట్లో వచ్చిన అగంతకులు ఉగ్రవాదులా? అన్నది తెలియాల్సి ఉంది.’’ఈ నేపథ్యంలో సర్క్రిక్ నుంచి సముద్రమార్గంలో వెళ్లడానికి ఏయే రాష్ట్రాలకు అవకాశం ఉంది.. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పోలీస్ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని సైనీ సూచించారు.