కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ శనివారం సాయంత్రం శ్రీవారి సహస్రదీపాలంకార సేవలో పాల్గొన్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి టిటిడి తిరుమల ప్రత్యేకాధికారి ఎవి.ధర్మారెడ్ఢి ఘనంగా స్వాగతం పలికారు.
సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి ఊరేగింపులో శ్రీమతి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. స్వామి పుష్కరిణిలో నీటిని ప్రోక్షణ చేసుకుని శ్రీవరాహ స్వామివారిని దర్శించుకున్నారు. పుష్కరిణి హారతి అందుకున్నారు. ఆ తర్వాత శ్రీవారి ఆలయంలో మహాలఘు దర్శనం చేసుకున్నారు.