ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూటాన్ లో పర్యటించునున్న ప్రధాని మోడీ

national |  Suryaa Desk  | Published : Sat, Aug 17, 2019, 10:24 AM

ప్రధాని నరేంద్ర మోడీ భూటాన్ లో రెండు రోజులపాటు పర్యటించనున్నారు.  ద్వైపాక్షిక సంబంధాల‌ను బ‌లోపేతం చేసేందుకు కొన్ని నిర్ణ‌యాలు తీసుకోనున్నారు. శనివారం (ఆగస్టు17) ఉదయం 11.30లకు భూటాన్ లోని పారో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 2.40కి తాషీచ్చోడ్జోంగ్ ప్యాలెస్‌కి వెళ్తారు. అక్కడ జరిగే చ్చిప్‌డ్రెల్ కార్యక్రమంలో పాల్గొని... స్వాగత సత్కారాలు పొందుతారు. మధ్యాహ్నం 3.10కి భూటాన్ రాజును, ప్రజలను మోదీ కలుస్తారు. సాయంత్రం 4.10కి భూటాన్ ప్రధాని డాక్టర్ లొతాయ్ షేరింగ్‌తో ప్రధాని మోడీ భేటీ అవుతారు. భూటాన్ పార్లమెంట్ గ్యాల్యోంగ్ షోఖాంగ్‌లో ఈ సమావేశం జరగనుంది.


సాయంత్రం 5 గంటలకు సెంటోఖా డ్జోంగ్‌ని సందర్శించే మోడీ... భారత్-భూటాన్‌లో 5 దశాబ్దాల హైడ్రోపవర్ సహకారానికి గుర్తుగా స్టాంపుల్ని ప్రారంభిస్తారు.  అనంతరం కొన్ని కీలక ఒప్పందాలు కూడా చేసుకోనున్నారు. కాగా ఈ పర్యటనలో మరో విశేషం కూడా ఉంది. భూటాన్ లో ప్రధాని మోడీ ఓ మొక్కను కూడా నాటనున్నట్లుగా సమాచారం. సాయంత్రం 6.15కి మోడీ... హోటల్ తాజ్ తాషీలో ప్రజలను కలసి అనంతరం రాత్రి 8 గంటలకు మోడీ... భూటాన్ ప్రధాని లొతాయ్ ఇచ్చే విందులో పాల్గొంటారు.


భారత్‌కి ఉత్తరాన ఉన్న భూటాన్  చైనా ఆధిపత్యంలో ఉంది. చైనాతో నువ్వా నేనా అన్నట్లుగా ఉంటున్న భారత్ భూటాన్ కు అండగా నిలుస్తోంది. ఆర్థికంగా చేయూతనిస్తోంది. ఈ క్రమంలో ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాల‌ను బ‌లోపేతం చేసేందుకు కొన్ని నిర్ణ‌యాలు తీసుకోనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com