ఇకపై ఏపీ బేవరేజెస్ ఆధ్వర్యంలో మద్యం షాపుల నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది . ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీ ని శుక్రవారం విడుదల చేసింది.
ప్రస్తుత ఏడాది లో 3,500 వైన్ షాపుల నిర్వహణ ని ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించనున్నామని తెలిపింది. వీటి నిర్వహణకు గాను ఎక్సయిజ్ సారధ్యంలో పట్టణప్రాంతంలో ఐదుగురిని, గ్రామీణ ప్రాంతాల్లో నలుగురిని ఒక్కో దుకాణానికి నియమిస్తామని తెలిపింది. పూర్తిగా ఔట్ సోర్సింగ్ విధానంలో ఈ ఉద్యోగుల నియామకం చేపడతుండగా సూపర్వైజర్కు డిగ్రీ, సేల్స్మన్కు ఇంటర్ విద్యార్హతగా నిర్ణయించామని, వీరి ఎంపిక జాయింట్ కలెక్టర్ల ఆధ్యర్వంలో ఆరుగురితో కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపింది.
ఈ మద్యం దుకాణానికి తెలుగు, ఇంగ్లీష్లో నెంబర్ బోర్డులతో పాటు ప్రతి మద్యం షాపులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారని ఈ పాలసీలో పేర్కొన్నారు. కాగా దశలవారీ మధ్య నిషేధం చేస్తామన్న ప్రభుత్వం అదనపు ఆదాయం పెంచుకునేందుకు ఇక ఒక్కో బాటిల్ కి కనీసంగా 10 రూపాయలవరకు పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం.