విశాఖపట్నం నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి : ఏపీ శాసనమండలి ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్ధిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.వి.ఎన్. మాధవ్ పోటీ చేయనున్నట్లు విశాఖలో టీడీపీ, బీజేపీ నాయకులు తెలిపారు. విజయవాడలో జరిగిన పార్టీ ఎన్నికల కమిటీ సమావేశంలో నాయకులు మాధవ్ పేరును ఖరారు చేసినట్లు తెలిపారు. ఈ సందర్బంగా విశాఖలోని ఓ హోటల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెదేపా ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, వెలగపూడి రామకృష్ణ బాబులు మిత్రపక్ష అభ్యర్ధి మాధవ్ కు కండువా వేసి టీడీపీ తరపున పూర్తి సహకారం అందిస్తామిమని అభినందనలు తెలిపారు. ఉత్తరాంధ్ర పట్టభద్రులంతా మొదటి ప్రాధాన్యత ఓటును తనకు వేసి గెలిపించి ఉత్తరాంధ్రను ఉత్తమఆంధ్రగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని మాధవ్ కోరారు.