మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్నది. జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది. దీనికి సంబంధించిన విభజన బిల్లును ఇవాళ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. జమ్మూకశ్మీర్తో పాటు లడాఖ్గా విభజించాలని కేంద్ర సర్కార్ నిర్ణయించింది. చంఢీఘడ్ తరహాలో లడాఖ్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు. ఆ ప్రాంతానికి లెజిస్లేచర్ ఉండదు. ఇక దేశ రాజధాని ఢిల్లీ తరహాలో జమ్మూకశ్మీర్కు అసెంబ్లీ ఉంటుంది. కేంద్ర మంత్రి అమిత్ షా ఈ ప్రకటన చేయగానే.. రాజ్యసభలో దుమారం చెలరేగింది. ప్రతిపక్ష సభ్యులు భారీ నినాదాలు చేశారు.
జమ్మూకశ్మీర్లోని లడాఖ్కు ఇక శాసనసభ ఉండదు. చాలా సుందర ప్రదేశం లడాక్. హిమాలయాలకు ఇదో మణిహారం. ఇక్కడ జనాభా తక్కువే. అక్కడక్కడ ప్రజా జీవనం ఉంటుంది. ఇక్కడి పర్వతాలు ఎక్కడం అంత సులువు కాదు. లడాఖ్ను ప్రత్యేక ప్రాంతంగా ప్రకటించాలని ఇప్పటికే అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడంతో అక్కడ ప్రజల్లో ఆనందోత్సహాలు వెల్లువిరిస్తున్నాయి. ఎక్కువగా బౌద్ధారామాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. లేహ్ కూడా ఈ ప్రాంతంలో ఉన్నది. బౌద్ధ మతాన్ని అనుసరించే వాళ్లు ఎక్కువగా ఉంటారు. అయితే సీమాంతర ఉగ్రవాదం అధికంగా ఉన్న జమ్మూకశ్మీర్ ప్రాంతాన్ని మాత్రమే విభజించలేదు. ఆ ప్రాంతానికి ప్రత్యేకంగా లెజిస్లేచర్ ఉంటుంది.