జమ్మూకాశ్మీర్ లో 379 అధికరణాన్ని రద్దు చేస్తూ తీసుకున్న మోదీ ప్రభుత్వ సంచలన నిర్ణయానికి రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఆమోదం తెలిపారు. రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి దీనిపై ప్రకటన చేసిన క్షణాల్లోనే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. గెజిట్ విడుదల చేశారు. లడఖ్ ప్రాంతాన్ని చట్ట సభలేని కేంద్ర పాలిత ప్రాంతంగా అమిత్ షా రాజ్యసభలో ప్రకటించారు. జమ్మూకాశ్మీర్ ను రెండుగా చీల్చారు. కేంద్ర పాలిత ప్రాంతంగా లడఖ్, జమ్మూ కాశ్మీర్ ను అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా రాజ్యసభలో అమిత్ షా ప్రతిపాదించారు. మోదీ సర్కార్ అనుకున్నట్లుగానే జమ్మూ కాశ్మీర్ ను రెండు ముక్కలు చేసింది.