ఏపీ అసెంబ్లీలో పులివెందుల పంచాయతీ అమలు చేస్తున్నారన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈరోజు అసెంబ్లీలో పరిస్థితులపై మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు సీఎం జగన్ ఏది ఆదేశిస్తే సభలో స్పీకర్ అదే పాటిస్తారని, బీసీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి బీసీల గొంతు నొక్కేస్తున్నారన్నారు. 45 ఏళ్లకే పెన్షన్ అమలుపై జగన్ చేసిన హామీ వీడియోను ప్రదర్శించిన చంద్రబాబు అసెంబ్లీలో ఈ వీడియోను ప్రదర్శించే అవకాశం ఇవ్వకపోవడంతోనే మీడియా సమావేశంలో ప్రదర్శించామన్నారు. ప్రశ్నించే వారిని అణచివేసి ఇష్టారాజ్యంగా ప్రవర్తించాలని చూస్తున్న ఈ ప్రభుత్వంపై రాష్ట్రంలో ప్రజలు ఇప్పటికే విసిగెత్తిపోయారన్నారు.