కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్ష సందర్భంగా పోలీసులు బెంగళూరులో పలు ఆంక్షలు విధించారు. ప్రస్తుతం అసెంబ్లీలో సీఎం కుమారస్వామి ప్రసంగం జరుగుతుండగా అనంతరం స్పీకర్ విశ్వాస పరీక్షపై చర్చ నిర్వహించనున్నారు. పరీక్షలో ప్రభుత్వం పడిపోయినా, సీఎం రాజీనామా చేసినా రాష్ట్రవ్యాప్తంగా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు ముందస్తుగా బెంగళూరులో 144 సెక్షన్ విధించారు.