ప్రపంచ బ్యాంకు వెనక్కి తగ్గడానికి కారణం వైసీపీ కాదా అని తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ… రైతుల పేరుతో ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు పెట్టించారన్నారు. ఇకపై ఏ ప్రాజెక్టుకూ నిధులు రావన్నారు. వీళ్లకు అభివృద్ది అవసరం లేదన్నారు. పులివెందుల గొడవలు ఇక్కడ కనిపిస్తున్నాయన్నారు. ఇసుక దొరక్క రేటు రెండింతలు పెరిగిపోయిందన్నారు. నిర్మాణాలు నిలిచిపోవడంతో కార్మికులు రోడ్డున పడుతున్నారన్నారు.