ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు కుల్‌భూషణ్ జాదవ్ కేసుపై తీర్పు

international |  Suryaa Desk  | Published : Wed, Jul 17, 2019, 09:34 AM

నేటి మధ్యాహ్నం మూడు గంటలకు కుల్‌భూషణ్ జాదవ్ కేసులో ది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు వెల్లడించనుంది. భారత నేవీ మాజీ అధికారి అయిన కుల్‌భూషణ్‌ను 3 మార్చి 2016లో పాకిస్థాన్ అరెస్ట్ చేసింది. గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలు మోపింది. విచారణ అనంతరం 11 ఏప్రిల్ 2017లో పాకిస్థాన్ మిలటరీ కోర్టు జాదవ్‌కు మరణశిక్ష విధించింది. దీంతో భారత ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్-పాకిస్థాన్ సమక్షంలో అంతర్జాతీయ న్యాయస్థానం నాలుగు రోజుల విచారణ జరిపింది. అనంతరం కేసు తీర్పును నేటికి వాయిదా వేసింది. నేడు తీర్పు వెల్లడించనున్న నేపథ్యంలో  పాకిస్థాన్‌ న్యాయ బృందం ఒక రోజు ముందే ది హేగ్ చేరుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com