నెల్లూరు: నెల్లూరు జిల్లా పరిషత్ సీఈవో బొబ్బా రామిరెడ్డి ఇంటిపై ఉదయం నుంచి ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్ నేతృత్వంలో తనిఖీలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు రూ. 2 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే గుంటూరు, నెల్లూరు, తిరుపతిలో ప్లాట్లు, గుంటూరులో భవనం ఉన్నట్లు గుర్తించారు. రూ.50 లక్షలకు సంబంధించి రుణ దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు సహా 15 చోట్ల ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి.