నెల్లూరు: ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కామినేని శ్రీనివాస్ హెచ్చరించారు. వైద్యుల పనితీరుపై మంత్రి కామినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేస్తూ కలెక్టర్ తనిఖీల్లో పట్టుబడ్డ ప్రభుత్వ వైద్యులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులపై శాఖ ముఖ్యకార్యదర్శితో విచారణ జరిపిస్తున్నామన్నారు. వైద్యులు ఇకనైనా తమ పద్దతి మార్చుకోవాలని తెలిపారు.