కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. తన మంత్రిత్వ శాఖలో గానీ, తన శాఖకు సంబంధించిన సమావేశాల్లో గానీ చాయ్, బిస్కెట్లను ఇవ్వరాదని హుకూం జారీచేశారు. వీటివల్ల ఆరోగ్యానికి సమస్యలు వస్తాయని, వాటి స్థానే వేయించిన పల్లీలు, బదాంలు, వాల్నట్స్ను అధికారులకు ఇవ్వాలని ఆయన అధికారులకు తేల్చి చెప్పారు. అంతేకాకుండా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో కూడా నీటిని ఇవ్వరాదని, వాటికి ప్రత్యామ్నాయంగా వేరే వాటిని చూడాలని అన్నారు. స్వతహాగా మంచి పేరు మోసిన హర్షవర్ధన్... ఈ సంచల నిర్ణయం తీసుకోవడంతో అందరూ స్వాగతిస్తున్నారు.