నరేంద్ర మోడీ తిరిగి అధికారం లోకి వస్తే అందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బాధ్యులవుతారని ఢిల్లీ ముఖ్య మంత్రి,ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు . ఢిల్లీ లో కాంగ్రెస్ పార్టీ తో పొత్తు కోసం ఆమ్ ఆద్మీపార్టీ గత రెండు నెలలుగా ప్రయత్నిస్తోందని, అయితే కాంగ్రెస్ కు పొత్తువిషయం ఆసక్తి కనబర్చలేదని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు . ఢిల్లీ లోని 7 లోక్ సభ సీట్లను కాంగ్రెస్ గెలుచుకునే పరిస్థితి ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ 7 లోక్ సభ సీట్లను కాంగ్రెస్ కు వదిలి పెట్టేదని , అయితే ఢిల్లీ లోకాంగ్రెస్ ఒక్క లోక్ సభ సీట్ ను గెలుచుకునే స్థితి లో లేదని కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీ లో బీజేపీ ని ఓడించగలిగిన సత్తా ఆమ్ ఆద్మీ పార్టీకే ఉందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. వాస్తవానికి కాంగ్రెస్ అవినీతి పై పోరాడడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటైందని గుర్తు చేస్తూ, దేశ ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రస్ తో పొత్తుకు సిద్ధమయ్యామని కేజ్రీవాల్ చెప్పారు. అయితే కాంగ్రెస్ దేశం లో ప్రతిపక్షాలను బలహీన పర్చే దిశలో పై పని చేస్తోందని కేజ్రీవాల్ విమర్శించారు. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కేరళ , ఉత్తర రాష్ట్రాలలో ప్రతిపక్షాలను కాంగ్రెస్ అధ్యక్షుడు బలహీనపరుస్తున్నారని కేజ్రీవాల్ విమర్శించారు. ఒక వేళ మోడీ అధికారం లోకి వస్తే అందుకు రాహుల్ గాంధీ బాద్యులవుతారని కేజ్రీవాల్ చెప్పారు.