ఇందుకూరుపేట పంచాయతీ కార్యాలయం వద్ద మైనార్టీలు బైఠాయించారు .ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామము లో తమ ముస్లిం కుటుంబాలు ఉన్నాయన్న కారణం తో కాలువ పనులు తమ ప్రాంతం వరకు చేయకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారంటూ ముస్లిమ్ మహిళలు ఆరోపించారు. యువకులు సోమవారం కొత్తూరు పంచాయతీ కార్యాలయం ముందు తీవ్ర నిరసన వ్యక్తం చేసారు. తమలో టిడిపి కి ఓటు వేసేవారు కూడా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసారు. స్థానిక అధికార పార్టీ నాయకులు కేవలం కక్ష పెట్టుకుని సాధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.