ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచ ఆర్థిక వేదికపై సన్‌రైజ్‌ స్టేట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 20, 2019, 12:38 AM

 ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల‌తో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు ఏపీ ఐటి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేష్‌ దావోస్‌ పర్యటనకు వెళుతున్నారు. ఈ నెల‌ 21 న హైదరాబాద్‌ నుంచి బయలుదేరుతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక ప్రతినిధుల‌ బృందానికి మంత్రి లోకేష్‌ నాయకత్వం వహించనున్నారు. సన్‌రైజ్‌ స్టేట్‌ ఆంధ్రప్రదేశ్‌కి మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చే ల‌క్ష్యంతో ఈ పర్యటన సాగనుంది. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాలు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్నాయి. మంత్రి నారా లోకేష్‌ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక ప్రతినిధి బృందం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డెలాయిల్‌, ప్రోక్టర్‌ అండ్‌ గేంబరల్‌, విప్రో, పెగా సిస్టవ్స్‌ు, ఆర్సెలార్‌ మిట్టల్‌, నెస్లే, ఏటీ అండ్‌ టి, ఇన్వెస్కో కంపెనీ ప్రతినిధుల‌తో భేటీ కానున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అనువైన పరిస్థితుల‌ను వివరించి వారిని ఒప్పించి రప్పించేందుకు ప్రపంచ ఆర్థిక వేదిక కేంద్రంగా కృషి చేయనున్నారు. ఈస్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం అమలు చేస్తున్న పాసీలు, ఇస్తున్న రాయితీలు ఆయా కంపెనీ ప్రతినిధుల‌కు వివరించనున్నారు.  ప్రపంచ ఆర్థిక వేదిక కాంగ్రెస్‌ సెంటర్‌లో జరగనున్న కీల‌క అంశాల‌పై మంత్రి లోకేష్‌ ప్రసంగించనున్నారు. 23న ఎజైల్‌ గవర్నెన్స్‌, డిజిటల్‌ గవర్నెన్స్‌, ఇండియా 4.0 అంశాపై నారా లోకేష్ కీల‌కోపన్యాసం చేయనున్నారు. 24వ తేదీన సస్టైనబుల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ వంటి అంశాపై మాట్లాడనున్నారు. దావోస్‌ పర్యటనలో వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి పూనం మాల‌కొండయ్య, వ్యవసాయ రంగం ప్రభుత్వ సల‌హదారుడు టి. విజయ్‌కుమార్‌, అజయ్‌జైన్‌, జాస్తి కృష్ణ కిషోర్‌, ఆరోఖ్య రాజ్‌, అహ్మద్‌బాబు, సమాచార శాఖ కార్యదర్శి బి. రామాంజనేయులు, డాక్టర్‌ జితేందర్‌ శర్మ, ఐటి ఓఎస్‌డి కిరణ్‌ గుత్తా, ఐటి జిఎం శ్రీనివాస్‌ పాల్గొననున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com