ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతు పంట‌కు అభ‌యం- ఏపి స‌ర్కారు నిర్ణ‌యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 20, 2019, 12:32 AM

నవ్యాంధ్రలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్నదాతకు అభయం ఇచ్చేందుకు ఎపి సర్కారు సిద్ధమైంది. ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించే కొత్త పధకాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. తెలంగాణ‌లో అమ‌ల‌వుతున్న‌ రైతుబంధు మాదిరి కాకుండా కౌలు రైతుకు కూడా ఈ పధకాన్ని వర్తింపచేయాల‌ని భావిస్తోంది. ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్‌ జగన్‌ తన పాదయాత్ర ముగింపు సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం బహిరంగసభలో ప్రతి  రైతు కుటుంబానికి రూ.12,500 పంటసాయం అందిస్తామని ప్రకటించిన నేపధ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి రైతుకూ , ఎక‌రాకు కొంత మొత్తం పెట్టుబడి సాయం అందించే పధకానికి ముందుగానే శ్రీకారం చుట్టనున్నారు.  ఓ వైపు కేంద్రప్రభుత్వం వచ్చే సార్వత్రిక ఎన్నికలోపు రైతుబంధు పధకం త‌ర‌హాలో ఓ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించేందుకు  సన్నాహాలు చేస్తున్న నేపధ్యంలో   అంతకంటే ముందుగానే ఈ పధకాన్ని ప్రకటించి ప్రజల‌కు చేరువ కావాల‌ని తెలుగుదేశం పార్టీ యోచిస్తోంది. హెక్టారుకు రూ.15వేలు ఇవ్వాని కేంద్రప్రభుత్వం భావిస్తందిని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో రైతు పంట సాగుకు అవసరమైన పెట్టుబడి సొమ్ము కోసం వెతకనవసరం లేకుండా రైతుకు నేరుగా కొంత ఆర్థిక సాయాన్ని ఈ ఖరిఫ్‌ సీజన్‌నుంచే అందించేలా చర్యలు చేపట్ట‌నుంద‌ని తెలిసింది. . కేవలం భూ యజమానుల‌కే కాకుండా కౌలు రైతుకు మేలు చేసేలా పెట్టుబడి సాయం ఉండ‌బోతోంది.   ప్రస్తుతం ఇన్‌పుట్‌ సబ్సిడీ, విత్తనాలు, ఎరువు సరఫరా, పశుపోషణకు సాయం, సాగునీరు, కేంద్రప్రభుత్వంతో నిమిత్తం లేకుండా మద్దతు ధరతో పంట కొనుగోలు, రుణమాఫీ వంటి పధకా ద్వారా రైతుకు ప్రభుత్వం ఇప్పటికే అండగా ఉంటోందని, తాజా ప‌థ‌కం రైతుల‌కు మేలు చేకూర్చ‌డంతో పాటు రానున్న ఎన్నిక‌ల‌లో త‌మ‌కు ఓట్లు రాల్చ‌నుంద‌ని అధికార తెలుగుదేశం భావిస్తోంది 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com