ఇప్పుడిప్పుడే క్రికెట్ లో నిలదొక్కుకుంటున్న హార్థిక్ పాండ్యాపై మరో వేటు పడింది. ఒక వేటు నుంచి తేరుకోకముందే మరో వేటు పడడంతో పాండ్యా పరిస్థితి మరింత దిగజారనుంది. తమ బ్రాండ్ అంబాసిడర్ గా పాండ్యాను తప్పిస్తున్నామని ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ జిల్లెట్ ప్రకటించింది. కాఫీ విత్ కరణ్ షో లో మహిళలపై నోరు పారేసుకోవడంతో కేఎల్. రాహులతో పాటు హార్థిక్ పాండ్యాపై బీసీసీఐ నిషేధం విధించిన విషయం తెలిసిందే. వీరిద్దరి స్థానంలో విజయ్ శంకర్, శుభ్ మాన్ గిల్ లను జట్టులోకి తీసుకున్నది. దీంతో వీరిద్దరికి ఇప్పట్లో జట్టులో స్థానం దక్కే అవకాశాలు లేకుండా పోయింది.