నేను ఎప్పుడు నాయకుల గురించి వ్యక్తిగతంగా మాట్లాడను, కొన్నిసార్లు తప్పక మాట్లాడాల్సి వస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గుంటూరు లో జరిగిన జనసేన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొందరు మళ్ళీ నేనే రావాలి, నా బాబు రావాలి అంటారు, జగన్ మూడు దశాబ్దాల నేనే రావాలి, వచ్చి అవినీతి చేయాలి అంటే మాట్లాడకుండా ఎలా ఉంటామని ప్రశ్నించారు. ఎప్పుడో 1950 ల్లో నాయకులు చేసిన తప్పులకు, ఇప్పటి నాయకులు తీసుకొచ్చిన పాలసీలకు ప్రజలు నష్టపోతుంటే ఎలా, మీరు ప్రజలకు నష్టం చేస్తున్నారు, మీరు బాగానే ఉంటారని అన్నారు. ప్రజలకు నష్టం ఎలా జరుగుతుంది అనేది నాయకులకు తెలియకపోవచ్చు, కానీ ఇక్కడకు వచ్చిన ప్రజలకు, బాధలు పడుతున్న యువతకు తెలుసునన్నారు. పెద్ద మనుషుల ఒప్పందం, శ్రీ బాగ్ ఒప్పందం అని నిర్ణయాలు నాయకులు తీసుకోని వాటి ద్వారా ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఎలా, మీ తప్పులకు మేమెందుకు బాధపడాలి. ఆనాడు నాయకులు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు, ప్రజల కోసం మాట్లాడే నాదెండ్ల లాంటి నాయకుల నోరు కూడా నొక్కేశారని విమర్శించారు.